Saturday, April 27, 2024

TS: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ

ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) : ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బోజ్జుతో కలిసి సీఎం నివాసగృహంలో రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి కాంగ్రెస్ టికెట్టు ఖరారు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

తొలిసారి మహిళా అభ్యర్థిగా అవకాశం కల్పించినందున పార్టీకి రుణపడి ఉంటానని ఎన్నికల ప్రచారంలో అందరితో కలుపుకొని వెళ్తానని సీఎంకు మాటిచ్చారు. శనివారం కౌటాల మండలం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్టు మంత్రి సీతక్క సీఎంకు వివరించారు. ఆమె వెంట టిపిసిసి జనరల్ సెక్రెటరీ సత్తు మల్లేష్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement