Thursday, May 9, 2024

గుట్కా స్థావరం పై పోలీసుల దాడులు.. భారీగా నిషేధిత గుట్కా స్వాధీనం..

నిజామాబాద్ అర్బన్ ప్ర‌భ‌న్యూస్ : జిల్లా కేంద్రంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నిషేధిత గుట్కాను టాస్క్ ఫోర్స్ ,సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు . ఈ మేరకు గురువారం నిజామాబాద్ రెండవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీ పీ నాగరాజు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్, సిసిఎస్ పోలీసులు నగరంలోని అమ్మది బజార్ లో ని అబూ కిరాణా షాప్ బిలాల్ చాలియ స్టోర్ లైన్ గల్లీ నిజామాబాద్ లో సి సి ఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్,2టౌన్ సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించగా అబు కిరణకు చెందిన గోదాం లో సుమారు పది లక్షల 65 వేల 292 రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బిలాల్ చాలియా స్టోర్ లో 29వేల 380 రూపాయలు నిషేధిత గుట్కా ను సీజ్ చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ కే. ఆర్ నాగరాజు తెలిపారు.

నేరస్తులు లైన్ గల్లీ కి చెందిన మహమ్మద్ అబూ బకర్ ముజాహిద్ నగర్ కు చెందిన షేక్ నేహాల్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు సిపి తెలిపారు. గతంలో మహమ్మద్ అబూబకర్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి ఉందని తరువాత కోర్టు నుంచి కేసులన్నీ కొట్టివేసిన తర్వాత మళ్లీ అదేవిధంగా కొనసాగుతున్నడని సమాచారంతో గురువారం దాడులు నిర్వహించామని తెలిపారు. దీంట్లో గుట్కా టొబాకో, సిగరెట్ ప్యాకెట్ ,పాన్ మసాలా నిషేధిత వస్తువులు ఉన్నాయని తెలిపారు. ఈ కేసును ఛేదించడం లో ముఖ్యపాత్ర వహించిన నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు, నిజామాబాద్ డీ సీ పీ డాక్టర్ వినీత్ సూచనల మేరకు సి సి ఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ .ఎస్.ఐ తిరుపతి 2 టౌన్ సిబ్బంది టాస్క్ ఫోర్స్ సిసిఎస్ సిబ్బందిని సీ పీ కే. ఆర్ నాగరాజు అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement