Monday, April 29, 2024

పీఈటీ మృతి..

బెల్లంపల్లి : బెల్లంపల్లి సెయింట్‌మేరీ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న క్రీడాకారుడు జిలకర అనీల్‌కుమార్‌ (55) కుప్పకూలిపోయి మృతి చెందాడు. వివరాల ప్రకారం బెల్లంపల్లి పట్టణంలోని పీసీఓఏ క్లబ్‌లో షటిల్‌ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో తోటి క్రీడాకారులు సమీపంలోని సింగరేణి ఏరియాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరణించినట్లు వైద్యులు తెలిపారు. అనీల్‌కుమార్‌ భార్య తాండూరు మండల తహశిల్దార్‌గా పనిచేస్తున్నారు. అనీల్‌ మరణవార్త విని పలువురు దిగ్ర్భాంతికి గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement