Wednesday, April 24, 2024

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక..

బెల్లంపల్లి : యాదవ సంఘం ఆధ్వర్యంలో బిజెపి నుండి సుమారు 250 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ లోకి చేరారు. పెద్దకూర మండలం గర్నెకుంట గ్రామసర్పంచ్‌ నడ్డి హాలీయమ్మ-రామాంజనేయులు యాదవ్‌, పిల్లి ఏడుకొండలు అధ్యక్షతన ముఖ్యమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి యాదవ్‌, కడారి అంజయ్య యాదవ్‌ల అధ్యక్షతన చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వర్రె విష్ణు యాదవ్‌, యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీహరి, తెలంగాణ రాష్ట్ర గొర్రెల కాపరుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ము అశోక్‌ యాదవ్‌, యూత్‌ సభ్యులు మెండె ఏడుకొండలు, కట్టబోయిన ఏడుకొండలు, మెండె శివశంకర్‌ కొండల్‌, పగడాల పరమేష్‌, ఎల్లయ్య, నరేష్‌, శివ, కోటేష్‌, యూత్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement