Sunday, April 28, 2024

పల్లెప్రగతి పనుల పరిశీలన..

కాసిపేట : మండలంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను అదనపు కలెక్టర్‌ త్రిపాఠి పరిశీలించారు. మల్కెపల్లి, తాటిగూడ, రొట్టెపల్లి తదితర గ్రామాల్లో జరుగుతున్న వైకుంఠదామం, డంపింగ్‌ యార్డు, పల్లె ప్రకృతి వనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులను వేగవంతం చేయాలని, త్వరలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకోవాలని సూచించారు. అంతకముందు ఎంపీడీఓ కార్యాలయంలో ఈజీఎస్‌ ద్వారా చేపట్టిన పనులు, ఆయా రికార్డులను పరిశీలించారు. ఆమె వెంట ఎంపీడీఓ ఆలీమ్‌, ఎంపీఓ సప్దార్‌ అలీ, ఆయా గ్రామపంచాయితీల సర్పంచులు, కార్యదర్శులు, అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement