Friday, April 19, 2024

లోటస్‌పాండ్‌లో కొనసాగుతున్న షర్మిల దీక్ష

హైదరాబాద్ – ఉద్యోగాల భర్తీ కి నోటిికేషన్లు విడుదల చేయాలని కోరుతూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష రెండో రోజుకి చేరింది తనకు గాయం కావడంతో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండానే దీక్ష చేస్తానన్నారు. తనను పోలీసులు గాయపరిచారని, మరోసారి చేయిపడితే ఊరుకోబోనని షర్మిల వార్నింగ్ ఇచ్చారు. చిరిగిన బట్టలుతోనేఆ తర్వాత షర్మిల లోటస్‌పాండ్‌లో దీక్ష కొనసాగిస్తున్నారు. కాగా షర్మిల దీక్ష కు ఆమె తల్లి విజయమ్మ సంఘీభావం తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం షర్మిల నిలబడిందని, షర్మిల పోరాటం కొనసాగుతుందని వైఎస్ విజయలక్ష్మీ చెప్పారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. పోలీసులు హింసాయుతంగా ప్రవర్తిస్తే ఆందోళనలు ఉధృతమవుతాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని విజయలక్ష్మీ తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement