Saturday, April 27, 2024

ADB: కారు ఢీకొని ఒకరు మృతి..

ఉట్నూర్, అక్టోబర్ 15 (ప్రభ న్యూస్): ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్ సమీపంలో ఇవాళ మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఉట్నూరుకు చెందిన నదీం (23) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంగా.. ఉట్నూర్ కి చెందిన నదీమ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎర్టిగా కారు ఢీకొనడంతో నదీం మృతి చెందారని తెలిపారు.

ఎర్టిగా కారు వాహనదారుడు వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో మృతుని కుటుంబీకులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు వాహనదారుని ఆచూకీ కోసం పర్యవేక్షణ చేస్తున్నారు. మృతిచెందిన యువకుడు ఉట్నూర్ సీనియర్ రిపోర్టర్ రహీం అన్న కొడుకు అని తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement