Friday, May 10, 2024

ADB: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలిసిన నిర్మల్ ఎమ్మెల్యే

నిర్మల్ ప్రతినిధి, ఫిబ్రవరి 7(ప్రభ న్యూస్): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్‌ను ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ఎమ్మెల్యేలు మ‌హేశ్వ‌ర్‌రెడ్డి, రాకేష్‌రెడ్డి, శంక‌ర్‌హ‌రీష్‌బాబులు డిల్లీలో క‌లిశారు. కేంద్రం గ్రామీణ ప్రాంతాల కోసం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ప‌థ‌కం ద్వారా నిధులు రాష్ట్రానికి ఇస్తే వాటిని రాష్ట్ర ప్ర‌భుత్వం దుర్వినియోగం చేస్తుంద‌ని ఆమెకు వివ‌రించారు. ఆ ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తే గ్రామీణ ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని కేంద్ర‌మంత్రి దృష్టికి తీసుకెళ్ల‌డం జ‌రిగింద‌ని నిర్మ‌ల్ ఎమ్మెల్యే ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement