Saturday, May 4, 2024

TS: మంచిర్యాల జిల్లాలో యువకుని హత్య

చెన్నూర్, ప్ర‌భ‌న్యూస్‌: మంచిర్యాల జిల్లాలో యువ‌కుడి దారుణ హ‌త్యకు గుర‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌ చెన్నూరు మండలం కమ్మరిపల్లిలో బుధ‌వారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…పొన్నరం గ్రామానికి చెందిన రామగిరి మహేందర్ కమ్మరిపల్లి గ్రామంలో కొంత మంది హత్య చేసి అనంత‌రం మృత‌దేహాన్ని త‌గ‌ల‌బెట్టారు.

స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న‌ పోలీసులు… పాక్షికంగా కాలిన మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement