Monday, May 6, 2024

ADB: నాగోబా ఆలయ మురాడి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఖానాపూర్, జనవరి 14 (ప్రభ న్యూస్): ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం లోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో కొలువుదీరిన నాగోబా ఆలయ మురాడి పనులను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మెస్రం వంశీయులతో కలసి ఆదివారం పరిశీలించారు.

ముందుగా మురాడి ఆలయంలో నాగోబా దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మెస్రం వంశీయులతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల చివరి వారంలో ఇంద్రవెల్లి అమర వీరుల స్తూపం వద్ద స్మృతి వనంతో పాటు నాగోబా మురాడి ఆలయాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మిగిలిన మురాడి ఆలయ పనులను ఈనెల 20వరకు త్వరీతగతిన పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement