Thursday, May 2, 2024

TS: అన్నివిధాలా అండగా ఉంటా.. మల్లేశ్‌ కుటుంబానికి కేటీఆర్‌ పరామర్శ

బీఆర్‌ఎస్‌ కార్యకర్త మల్లేశ్‌ కుటుంబాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం పరామర్శించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లిలో మల్లేశ్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కేటీఆర్‌ మల్లేశ్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మల్లేశ్‌ చిత్రపటానికి పూలమాల వేసి కేటీఆర్‌ నివాళులర్పించారు. మల్లేశ్‌ కుటుంబానికి కేటీఆర్‌ మనోధైర్యం కల్పించారు. అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement