Saturday, April 27, 2024

నిర్మ‌ల్ మెడిక‌ల్ కాలేజీకి ఎంసీఐ అనుమ‌తి.. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హ‌ర్షం

నిర్మల్ జిల్లా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ త్వరలో ప్రారంభం కాబోతుంది. మెడికల్‌ కాలేజీ ప్రారంభానికి అవసరమైన ప్రాథమిక అనుమతులను నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌, మెడికల్ అసెస్మెంట్ అండ్‌ రేటింగ్ బోర్డ్ పర్మిషన్ లను మంజూరు చేసింది. ఈ మేరకు 100 మెడికల్‌ సీట్ల ప్రవేశానికి నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ప్రాథమిక అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాలేజ్ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు, ప్రత్యేక చొరవ చూపిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

2023- 2024 నుంచి మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ క్లాసులు ప్రారంభం కానున్నాయి. నిర్మల్ జిల్లా ప్రజలు ఎంతోకాలంగా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల కోరిక మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఇచ్చిన హామీ మేరకు నిర్మల్ జిల్లాకు మెడికల్‌ కాలేజీని మంజూరు చేసి దాన్ని సాధించామని ఆయన వెల్లడించారు.. నిర్మల్ జిల్లా కేంద్రంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ఉత్తర్వులను జారీ చేయటంతో పాటు నిధులు కూడా కేటాయించింది. మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కూడా కేటాయించింది. దీంతో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో 2023-24 ఏడాదిలో ఎంబీబీఎస్ తరగతులు స్టార్ట్ కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement