Saturday, May 4, 2024

బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్క‌టే.. రేవంత్ రెడ్డి

బీజేపీ, బీఆర్ఎస్ లు బయట విమర్శలు చేసుకుంటాయి.. కానీ రెండు ఒక్కటే అంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయ‌న మాట్లాడుతూ… బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని కర్ణాటక ఎన్నికల్లో రుజువైందని.. బీజేపీని గెలిపించటానికి కేసీఆర్ పనిచేశారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. జేడీఎస్ తో కలిసి కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కేసీఆర్ ప్లాన్లు వేశారని.. కానీ ఎవరెన్ని ప్లాన్లు వేసినా.. ఎన్ని కుట్రలు చేసినా కర్ణాటక‌లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనన్నారు. కుమారస్వామి సింగపూర్ లో ఉండి ప్లాన్లు వేస్తే.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని గెలిపించటానికి ప్లాన్లు వేశారని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఖాయమ‌ని ధీమా వ్యక్తంచేసిన రేవంత్ రెడ్డి.. అక్కడ కాంగ్రెస్ వస్తే తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసే గెలుస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement