Tuesday, April 23, 2024

ఎంజిఎంలో మ‌రో అమానుషం – స్ట్రెచర్ లేక భార్య‌ను మోసుకెళ్లిన భ‌ర్త‌

వ‌రంగ‌ల్ – పెద్ద ప్రభుత్వాసుపత్రిగా పేరున్న ఈ ఎంజీఎం దవాఖానాలో క‌నీసం స్ట్రెచ‌ర్ లు కూడా అందుబాటులో ఉండ‌టం లేదు.. కాలికి ఆప‌రేష‌న్ చేయించుకున్న మ‌హిళ‌ను బ‌య‌ట‌కు తీసుకెళ్లేందుకు స్ర్టెచ‌ర్ లేక‌పోవ‌డంతో భ‌ర్త భార్య మోసుకెళ్లాడు.. వివ‌రాల‌లోకి వెళితే లక్ష్మి అనే వృద్ధురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినది. నెల రోజుల క్రితం ఎంజీఎం డాక్టర్లు ఆపరేషన్‌ చేసి అరిపాదం తొలగించారు. నెల తర్వాత లక్ష్మిని చెకప్‌ కోసం ఆమె భర్త ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే పెద్దసారు లేరని, రేపు రావాలంటూ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. బయటకు వెళ్లేందుకు కనీసం స్ట్రెచర్‌ అయినా ఇవ్వాలని కోరినా.. సిబ్బంది దానికి నిరాకరించారు. వృద్ధురాలైన ఓ పేషెంట్‌ పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానాలతో కర్కశకంగా వ్యవహరించారు. సదరు వృద్ధురాలికి కనీసం స్ట్రెచర్‌ కూడా ఇవ్వకపోవడంతో ఆమె భర్తే భుజాన వేసుకుని మోసుకెళ్లాడు. దీనిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement