Monday, April 29, 2024

లారీ, బైక్ ఢీ.. ఇద్దరికీ తీవ్రగాయాలు..

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని నిర్మల్ చౌరస్తా వద్ద ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… భైంసా నుండి నిర్మల్ వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొనడంతో నర్సాపూర్ మండలం కుస్లి గ్రామానికి చెందిన మోహన్, దత్తుకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానికుల సహాయంతో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement