Tuesday, May 14, 2024

LIVE from Siricilla – గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందజేస్తున్న మంత్రి కెటిఆర్

Minister Sri. KTR Participating in Distribution of Podu Pattas to the Beneficiaries at Sircilla

https://youtu.be/UcVLdl7goPc


సిరిసిల్ల – రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ముందుగా జిల్లా తంగళ్లపల్లి మండలం వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
అక్కడి నుంచి జిల్లా సమీకృత కలెక్టరేట్ కు చేరుకోనున్నారు. 124 మంది చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందజేస్తారు. అనంతరం పద్మనాయక కల్యాణ మండపంలో 1650 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలను పంపిణీ చేస్తారు.
సిరిసిల్ల బీఆర్‌ఎస్‌వీ యూత్‌ అధ్యక్షుడు సుంకపాక మనోజ్‌ తండ్రి ఇటీవల మృతి చెందగా, స్వగ్రామం విలాసాగర్‌కు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు
Advertisement

తాజా వార్తలు

Advertisement