Thursday, April 25, 2024

Adilabad: బోర‌జ్ చెక్ పోస్ట్ పై స్థానికుల దాడి

ఆదిలాబాద్ జిల్లాలోని బోర‌జ్ చెక్ పోస్ట్ పై స్థానికులు దాడికి పాల్ప‌డ్డారు. ఈ చెక్ పోస్ట్ ద‌గ్గ‌ర వ‌రుస ప్ర‌మాదాల‌పై స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చెక్ పోస్ట్ ద‌గ్గ‌ర లారీ ఢీకొని టీచ‌ర్ ప‌ద్మ మృతిచెందింది. ఈ ప్ర‌మాదంలో మ‌రొక వ్య‌క్తికి తీవ్ర‌గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అలాగే నిన్న చెక్ పోస్ట్ ద‌గ్గ‌ర లారీ ఢీకొని చిన్నారి మృతిచెందిన విష‌యం విధిత‌మే. నిన్న అలా… ఈరోజు ఇలా రోడ్డు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డంతో స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement