Wednesday, May 8, 2024

కేసీఆర్ పాలనలోనే గిరిజనులకు న్యాయం.. ఎమ్మెల్యే బాపురావు

తాంసి, జులై 6 (ప్రభాన్యూస్) : కేసీఆర్ పాలనలోనే గిరిజనులకు న్యాయం జరిగిందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని తాంసి మండలం కేంద్రంలో తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాలకు చెందిన పోడు రైతులకు 489 పోడు పట్టాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో ఆదివాసీలకు అన్యాయం జగిందన్నారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆదివాసీ గూడేలను, తండాలను పంచాయతీలుగా గుర్తించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కె చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ రాజు, వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ రఘు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, ఆర్డీలో రమేష్ రాథోడ్, ఎంపీడీఓ ఆకుల భూమయ్య, తహసీల్దార్ శ్రీదేవి, నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్, స్థానిక సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్, మండల కన్వీనర్లు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement