Sunday, May 26, 2024

ఐసోలేషన్‌ కేంద్రాన్ని పరిశీలించిన జీఎం..

బెల్లంపల్లి : పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న జిల్లా ఐసోలేషన్‌ కేంద్రాన్ని బెల్లంపల్లి ఏరియా జీఎం బి.సంజీవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కోవిడ్‌ ఆసుపత్రిలో కరోనా వ్యాధిగ్రస్తులకు తగు వైద్య సేవలు అందించాలని, ఏ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డీవైసీఎంఓ ఆర్‌.చౌరి, వైద్యుడు రాధాకృష్ణలను జీఎం ఆదేశించారు. అంతేకాకుండా ఆక్సీజన్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచి పేషెంట్లకు వినియోగించాలని, కోవిడ్‌ పరీక్షా కేంద్రాన్ని, వ్యాక్సిన్‌ కేంద్రాన్ని జీఎం పరిశీలించారు. ఆయన వెంట టీబీజీకెఎస్‌ ఫిట్‌ సెక్రటరి హనుమాండ్ల సత్యనారాయణ, ఏఐటీయూసీ నాయకులు దాసరి శ్రీధర్‌, పర్సనల్‌ మేనేజర్‌ లక్ష్మణ్‌రావు, పారా మెడికల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement