Thursday, May 16, 2024

ఘనంగా మైసమ్మ బోనాలు.. పాల్గొన్న ప్రభుత్వ విప్ సుమన్

మంచిర్యాల : శ్రీ గాంధారి మైసమ్మ బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసన సభ్యులు బాల్క సుమన్ బోనమెత్తి మొక్కలు చెల్లించారు. అనంతరం మాట్లాడుతూ.. అమ్మవారు ప్రజలందరినీ చల్లంగా చూడాలని కోరుకున్నామన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ మహేష్ తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement