Thursday, May 2, 2024

ADB: ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల జనరల్ అబ్జర్వర్

ఉట్నూర్, నవంబర్ 10 (ప్రభ న్యూస్) : అసెంబ్లీ ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఆర్డీఓ కార్యాలయాన్ని ఎన్నికల రాష్ట్ర జనరల్ అబ్జర్వర్ గోపాలకృష్ణన్ సందర్శించారు. ఆయనకు ఖానాపూర్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎల్ జివాకర్ రెడ్డి పుష్పగుచ్చంతో సన్మానించి స్వాగతించారు.

రాష్ట్ర జనరల్ ఎన్నికల అబ్జర్వర్ నామినేషన్ల ప్రక్రియను అడిగి తెలుసుకుని పరిశీలించారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వివరాల గురించి ఎన్నికల రిటర్నింగ్ అధికారితో చర్చించారు. అధికారి కార్యాలయం ఉట్నూర్ లో ఎన్నికల పనులను పరిశీలించారు. ప్రశాంతంగా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement