Wednesday, May 1, 2024

ADB: బీజేపీ రెబల్ అభ్యర్థిగా అందుగుల శ్రీనివాస్ నామినేషన్

చెన్నూర్, నవంబర్ 10 (ప్రభ న్యూస్) : భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అందుగుల శ్రీనివాస్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ టికెట్టు ఆశించి గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తున్నానని తెలిపారు.

నియోజకవర్గంలో అధికార పార్టీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పోరాటం చేసిన పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జరుగబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉండనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement