Saturday, May 4, 2024

హైరిస్క్ గ్రామాలపై దృష్టి పెట్టాలి… ఐటీడీఏ పీవో

జైనూర్, జులై 20 (ప్రభ న్యూస్) ఐ రిస్క్ గ్రామాలపై దృష్టి పెట్టాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పేయి అన్నారు. గురువారం కొమరం భీం జిల్లా జైనూర్ మండలంలోని ఉషగాం ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించి వ్యాధుల వివరాలు, ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసూతి తదితర వైద్య సేవల గురించి వైద్యాధికారి రాజుతో అడిగి తెలుసుకున్నారు.

ఆస్పత్రిలో బయోమెట్రిక్ మిషన్స్ లేదా అని వైద్య ఉద్యోగులను అడుగగా మిషన్ రిపేర్ లో ఉందని, పనిచేయటం లేదని పీఓకు వైద్య ఉద్యోగులు తెలిపారు. వ్యాధుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతిరోజూ వైద్య శిబిరాలు నిర్వహించాలని పీఓ వైద్య ఉద్యోగులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రాజు, హెచ్ఈఓ జాదవ్ రమేష్, వైద్య ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement