Monday, May 6, 2024

ముంపు రైతులను ఆదుకోవాలి.. సీఎం కేసీఆర్‌కు బీజేపీ లేఖలు..

చెన్నూర్: కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ముంపుకుగురై నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ బీజేపీ పార్టీ అధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ కు తెలిసేలా పోస్టు కార్డుల ఉద్యమాన్ని చేపడుతున్నట్లు బీజేపీ పట్టణ అధ్యక్షులు సుశీల్ కుమార్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు కోటపెల్లి జైపూర్ మండలాల రైతులకు చెందిన పంట చేనులు గత మూడు సంవత్సరాలుగా నీటమునిగి నష్టం పోతున్నారని రైతులు పెట్టిన పెట్టుబడి రాక ఆత్మహత్యలు చేసుకొని దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం ముంపుకు గురవతున్న భూములను 30లక్షల ఎకరా చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసే వరకు బీజేపీ అధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం చేపటనునట్లు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement