Tuesday, April 30, 2024

ADB: కన్నుల‌ పండుగ రంజాన్ వేడుకలు… నిర్మల్ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు

నిర్మల్ ప్రతినిధి, ఏప్రిల్ 11( ప్రభ న్యూస్) : ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదిన ఈదు ఉల్ ఫితర్ ను పురస్కరించుకుని గురువారం నిర్మల్ పట్టణంలోని ఇదిగో వద్ద ముస్లిం సోదరులు ఉదయం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సుగుణ ఈదుల్ ఫిత్ర్ పర్వదినం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గమ్ వద్ద ముస్లిం సోదరులకు ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీహరి రావు పిల్లలు, పెద్దలతో ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అల్లా దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ముస్లిం సోదరులు, సోదరీమణులు, నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి అయిదుసార్లు నమాజ్ తో పాటు తరావీహ్, ప్రత్యేక నమాజ్ ఆచరించి అల్లా ముందు శిరస్సు వంచి విధేయతతో ప్రార్థించారని, వివిధ రూపాల్లో పేదలకు సహాయం చేయడం చాలా గొప్ప విషయమ‌న్నారు. ఈసందర్భంగా ఆత్రం సుగుణ మాట్లాడుతూ… ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో సదక, ఫిత్రా, జకాత్, లాంటి ఆచారాలతో పేదలకు చేయూత ఇవ్వడం చాలా గొప్ప కార్యమ‌న్నారు. నెల రోజులు ఉపవాస దీక్షలు చేయడం చాలా గొప్ప విషయమ‌న్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో పాటు పట్టణ అధ్యక్షులు నందేడపు చిన్ను, మాజీ మునిసిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, కౌన్సిలర్లు తారక వాణి రఘువీర్, కొంతం గణేష్, పూదరి అరవింద్, చిరంజీవి, నర్సారెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement