Tuesday, May 21, 2024

TS: జన్నారం మార్కెట్ కమిటీ పాలకవర్గం రద్దు

జన్నారం : మంచిర్యాల జిల్లా జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని మంగళవారం రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కమిటీని 2022, ఆగస్టు 8న అప్పటి బి.ఆర్.ఎస్ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, గిడ్డంగుల మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం రద్దు చేసింది.

కమిటీ అధ్యక్షురాలుగా సీపతి పద్మ బుచ్చన్న, సభ్యులుగా ఎస్.భరత్ కుమార్, అన్నే కాంతామని, ఎం.డి రజాక్, గర్రిపెళ్లి హరీష్ గౌడ్, మెంగని వెంకటేష్, యశోద భాస్కర్, భరత్ కుమార్, నర్సాగౌడ్, ముమ్మాటి సంతోష్ కుమార్, పి.రాయమల్లు, జక్కు శ్రీనివాస్, ఎర్ర సునీతతో పాటు 18మంది సభ్యుల కమిటీ పాలకవర్గాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు అధ్యక్షురాలు పద్మ బుచ్చన్న సాయంత్రం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement