Friday, April 26, 2024

బెల్లంపల్లిలో విజృంభిస్తున్న కరోనా వైరస్

బెల్లంపల్లి : పట్టణంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుంది. అందులో భాగంగా బెల్లంపల్లిలో ప్రతీరోజు 50 వరకు కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదు కావడంతో మున్సిపల్‌ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్లపై సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచ్‌కారీ చేశారు. పట్టణంలోని 34 వార్డుల్లో ఆయా వార్డుల కౌన్సిలర్లు కరోనా నివారణ కోసం వార్డుల్లో ద్రావణాన్ని పిచ్‌కారీ చేయిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. 19వ వార్డు కౌన్సిలర్‌ కొమ్ముల సురేష్‌ సిబ్బంది వెంట ఉండి హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచ్‌కారీ చేయిస్తూ కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement