Sunday, April 28, 2024

Adilabad లో కాంగ్రెస్ ఖాళీ – సీనియర్లు అందరూ మూకుమ్మడి రాజీనామా

.ఉమ్మడి అదిలాబాద్ ప్రభ న్యూస్ బ్యూరో అదిలాబాద్ కాంగ్రెస్ లో అసమ్మతి నేతలంతా ఆ పార్టీకి గుడ్ బయ్ చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ టికెట్ ను ఆశించి బంగపడ్డ టిపిసిసి ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకురాలు గండ్రత్ సుజాత, అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి తో పాటు 500 మంది కార్యకర్తలు సోమవారం రాజీనామా చేయి అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం పార్టీ జెండా మోసిన సీనియర్లకు బే ఖాతరు చేసి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న పెట్టుబడిదారులకు టికెట్లు అనుకుంటున్నారని ఆ పార్టీలో ఇక కొనసాగే ప్రసక్తే లేదని సీనియర్లు ఆదివారం సాయంత్రంనిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవులకు ప్రాథమిక సభ్యత్వానికి మూకుమ్మడిగా రాజీనామా చేసి అధిష్టానానికి పంపనున్నారు.

కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి మేనల్లుడు అల్లూరి సంజీవరెడ్డిని పోటీలోకి దింపనున్నారు. ఈనెల 10వ తేదీన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని డిసిసి అధ్యక్షుడు సాహిద్ ఖాన్ సంప్రదించగా రాజీనామా చేయడానికి నిర్ణయం తీసుకున్న విషయం వాస్తవమేనని తెలిపారు. సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని ఆంధ్రప్రభ కు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement