Thursday, May 2, 2024

Srisailam మల్లన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి

శ్రీశైలం ప్రభ న్యూస్.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం నాడు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయ మూర్తి వెంకట జ్యోతిర్మయి కుటుంబ సమేతంగా భ్రమరాంబ దేవి మల్లికార్జున స్వామి అమ్మవార్లకు దర్శించుకున్నారు ముందుగా ఆలయ ప్రధాన రాజ గోపురం వద్ద దేవస్థానం సహాయ కార్య నిర్వహణ అధికారులు . హరిదాసు. మోహన్ అర్చక పరిచారక స్వాములు వేద పండితులు న్యాయమూర్తికి దంపతులకు స్వాగతం పలికారు.

అనంతరం న్యాయమూర్తి దంపతులు స్వామివారికి అభిషేకం. అమ్మవారికి కుంకుమార్చన. ప్రత్యేక పూజాదికాలను నిర్వహించారు అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణం లోని ఆశీర్వచన మండపంలో న్యాయమూర్తి దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి. మోహన్. స్వామి అమ్మవార్ల శేష వస్త్రం జ్ఞాపిక ప్రసాదాలను న్యాయమూర్తి దంపతులకు అందజేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement