Friday, May 3, 2024

జాగృతి ఆధ్వర్యంలో చలివేంద్రం..

బెల్లంపల్లి : తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు సిద్ధంశెట్టి సజన్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని తిలక్‌ స్టేడియం ఆవరణలో వేసవి దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, జాగృతి నాయకులు వంశీ, కరుణాకర్‌, రాకేష్‌, సల్మాన్‌, మహంతి, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement