Saturday, May 18, 2024

ADB : బోథ్ కాంగ్రెస్ అభ్యర్థి గా ఆడే గజేందర్

బోథ్, నవంబర్ 7(ప్రభ న్యూస్)
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆడె గజేందర్ ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. రెండవ లిస్టులో ఎమ్మెల్యే అభ్యర్థి గా ప్రకటించిన వన్నెల అశోకుని కాదని చివరి క్షణంలో ఆడె గజేందర్ కు చోటు కల్పించింది. నేడు హైదరాబాదులో ఆడే గజేందర్ బీఫామ్ తీసుకోబోతున్నాడు.

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆడే గజేందర్ కు టికెట్ లభించడంతో గజేందర్ వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆదివాసి నాయకుడు వన్నెల అశోకుని తొలగించడం పట్ల ఆదివాసి సంఘాలన్నీ గుర్రుగా ఉన్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement