Saturday, April 27, 2024

TS : ఆశ్రమ పాఠశాల బియ్యాన్ని త‌ర‌లిస్తుండ‌గా… పట్టుకున్న విద్యార్థులు

జైనూర్, మార్చి 25 (ప్రభన్యూస్)కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో అక్రమంగా తరలిస్తున్న 15 బస్తాలు ఆటోలో తరలిస్తుండగా అదే పాఠశాల విద్యార్థులు పసిగట్టి పట్టుకున్నారు. విద్యార్థులు, గ్రామస్తులు…. తెలిపిన వివరాల ప్రకారం పట్నాపూర్ ఆశ్రమ పాఠశాలకు చెందిన బియ్యం ఆదివారం అర్థ‌రాత్రి వచ్చి బియ్యం బస్తాలని అటోలో నింపి తరలించే సమయంలో ఆ పాఠశాల కొందరు విద్యార్థినిలు తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.

- Advertisement -

విద్యార్థులు, గ్రామస్తులు మాట్లాడుతూ తమకు సరైన భోజన సౌకర్యం కల్పించడం లేదని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నోసార్లు బియ్యం తరలిస్తున్న చూసి చూడకుండా ఉన్న విద్యార్థులు రాత్రి తరలిస్తున్న సమాచారం తెలుసుకొని కాపలా ఉండి పగడ్బందీగా పట్టుకున్నట్లు విద్యార్థులు తెలిపినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. అర్ధరాత్రి పట్టుకున్న ఆటోను హాస్టల్లోనే నిలిపివేశారు. ఈ విషయమై ఏటిడిఓ పురుషోత్తంను వివరణ అడగగా తాను సెలవు కారణంగా ఇంటికి వెళ్లానని తెలిపారు. ఆ పాఠశాల హెచ్ఎం పరశురాంను వివరణ అడగగా ఆరు క్వింటాళ్ల బియ్యంను తీసుకొని మిగతా వాటిని తిరిగి పంపిస్తున్నానని, విక్రయించడానికి కాదని హెచ్ఎం పరశురాం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement