Thursday, May 9, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి.ఉద‌య్ కుమార్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి ఎస్పి ఎం.రమణ కుమార్ చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి ఇందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయం నందు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పూర్తి చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ లో ఈరోజు మొక్కలు నాటడం జరిగిందని, తాను ఈ ఛాలెంజ్ ను ఆసిఫాబాద్ ఎస్పీ కే సురేష్ కుమార్, నిర్మల్ ఎస్పీ సీ హెచ్ ప్రవీణ్ కుమార్, మంచిర్యాల్ అడిషనల్ డీసీపీ అఖిల్ మహాజన్ లకు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. చెట్లు మానవాళికి, మనిషి మనుగడకు జీవనాధారం.. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి చెట్లను పెంచడం, వాటిని సంరక్షించడం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు వి ఉమేందర్, ఎం విజయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, ఎం శ్రీపాల్, ఎం వంశీకృష్ణ, డిసిఆర్బి ఇన్ స్పెక్ట‌ర్ జే గుణవంతురావ్, రిజర్వ్ సిబ్బంది, పోలీసు కార్యాలయం ఏవో యూనిస్ అలి, సూపరిండెంట్ జోసెఫిన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement