Sunday, April 28, 2024

ADB: బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు నామినేషన్..

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) : అదిలాబాద్ లోక్ స‌భ‌ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవలక్ష్మి, మాజీమంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇన్చార్జి జాన్సన్ నాయక్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. అదిలాబాద్ కలెక్టరేట్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజార్షి షా కు ఆత్రం సక్కు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

అనంతరం మీడియా పాయింట్ లో ఆత్రం సక్కు మాట్లాడుతూ… పేద, బ‌డుగు వర్గాల అభ్యున్నతి కోసం రైతు సంక్షేమం కోసం పాటుపడ్డ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని, ఈసారి బీఆర్ఎస్ ను ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పిటిసిలు, మండల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement