Sunday, April 28, 2024

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఏసీపీ

భీమారం 6 ఏప్రిల్ (ప్రభ న్యూస్) : ప‌దో తరగతి పరీక్ష కేంద్రాల‌ను(హాల్) జైపూర్ ఏసీపీ నరేందర్, శ్రీరాంపూర్ సీఐ రాజు తనిఖీ చేశారు. గురువారం భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో నిర్వ‌హించిన ప‌రీక్ష కేంద్రాన్ని వారు ప‌రిశీలించారు. ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌పై ఎగ్జామ్ సెంటర్ సూపరిండెంట్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష జరుగుతున్న గదులను, పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు తాగు నీటి సౌకర్యాలు, ఇత‌ర‌త్ర సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు. ప‌క‌డ్బందీగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని సిబ్బందికి సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో భీమారం ఎస్ఐ జి.సుధాకర్, జైపూర్ ఎస్ ఐ రామక్రిష్ణ లు, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement