Saturday, April 27, 2024

భైంసాలో నకిలీ నోట్ల కలకలం..!

నిర్మల్ జిల్లా భైంసాలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ప్రవీణ్ అనే కూరగాయల వ్యాపారి దగ్గర ఓ బాలుడు రూ.500 నోటు ఇచ్చి రూ.20 కూరగాయలు కొనుగోలు చేసి.. రూ.480 చిల్ల‌ర తీసుకెళ్లాడు. మళ్లీ కాసేపటికే మరో రూ.500 నోటు తీసుకొని వచ్చి మళ్లీ కూరగాయలు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ నోటు పై అనుమానం వచ్చిన వ్యాపారి బాలుడిని ప్రశించే య‌త్నం చేయగా పరాయ్యాడు. దీనిపై ప్రవీణ్ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement