Saturday, May 18, 2024

షెడ్డు నిర్మాణానికి భూమిపూజ

గణపురం:మండల కేంద్రంలోని కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో గోమాతల నివాసం కోసం నిర్మిస్తున్న షెడ్డు నిర్మాణానికి శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ రూ 60వేలు సహాయంగా అందించింది.శనివారం శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధి దూడపాక శంకర్ భూమి పూజ చేశారు.గోశాల నిర్మాణం కోసం ముందుకు వచ్చిన.శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ నిర్వాహకులకు కోటగుళ్ల పరిరక్షణ కమిటీ కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు నరేష్,నిర్వాహకులు నాగపురి శ్రీనివాస్,భక్తులు గోనె తిరుపతి రావు,తదితరులు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement