Friday, May 3, 2024

రోడ్డుపై బైఠాయించిన నాయకులు, గ్రామస్తులు

కాసిపేట : మందమర్రి ఏరియా కళ్యాణిఖని ఓపెన్‌కాస్టు గనిలో ముంపునకు గురవుతున్న కాసిపేట మండలం దుబ్బగూడెం గ్రామస్తులు బీఎంఎస్‌ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా బీఎంఎస్‌ నాయకులు మాట్లాడుతూ గత నెలలో తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గ్రామస్తులు ఓసీకి వెళ్లే రోడ్డుపై వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారని, ఈ సందర్బంగా ఏరియా అధికారులు అన్నివిధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నేటికి అది కార్యరూపం దాల్చలేదని ఆరోపించారు. పునరావాసం, పరిహారం చెల్లింపు, నిరుద్యోగ యువకులకు ఓసీలో ఉద్యోగావకాశాల కల్పనకై ఇచ్చిన హామీల ఊసే లేదని, దాంతో గ్రామస్తుల సమస్యలను పరిష్కరించాలనే ముఖ్య డిమాండ్‌తో రోడ్డుపై బైటాయించినట్లు నాయకులు పేర్కొన్నారు. గ్రామస్తులకు ఇచ్చిన హామీలను అధికారులు పరిష్కరించే వరకు పలు రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్‌ నాయకులు డొనికెల రమేష్‌, పేరం రమేష్‌, యాదగిరి సత్తన్న, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement