Thursday, May 9, 2024

గ్రామాభివృద్ధికోసం..

కాసిపేట: రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి సర్పంచ్‌, వార్డు సభ్యులంతా పాటుపడాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్లికేరి అన్నారు. సోమగూడెం (బి) గ్రామపంచాయితీని కలెక్టర్‌ సందర్శించారు. గ్రామంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులు, డంపింగ్‌యార్డు, వైకుంఠదామం, ప్రకృతి వనం తదితర పనులను పరిశీలించారు. ప్రకృతి వనంలో నాటిన మొక్క భద్రంగా పెరిగేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా వార్డు సభ్యులు రాజకీయాలు మరిచి పంచాయితీ అభివృద్ది కోసం అందరు సహకరించుకోవాలని వార్డు సభ్యులకుసూచించింది. ఎన్నికల వరకే రాజకీయాలను పరిమితం చేయాలి గానీ గ్రామాభివృద్ధికి ఆటంకంగా ఉండరాదని హితవు పలికారు. కలెక్టర్‌ వెంట స్థానిక సర్పంచ్‌ ప్రమీళగౌడ్‌, వార్డు సభ్యులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement