Thursday, May 2, 2024

Tollywood Drug Case: ఈడీ విచారణకు హాజరైన మాస్ రాజా

టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఈడీ ముమ్మరంగా విచారిస్తోంది. ఇప్పటికే  ఈ కేసులులో పలువురు సినీ తారలను విచారించిన ఈడీ.. తాజాగా ఇవాళ హీరో రవితేజను విచారిస్తోంది. గురువారం ఉదయం ఈడీ విచారణకు రవితేజ హాజరైయ్యారు.  ఆయనతో పాటు కారు డ్రైవర్ శ్రీనివాస్ కూడా హాజరయ్యాడు. డ్రగ్స్ కేసులో నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ విచారణ కొనసాగుతోంది. కెల్విన్‌తో ఆర్థిక సంబంధాలపైన ఈడీ ప్రశ్నించనుంది.

మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ను ఇవాళ మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నాడు. కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే టాలీవుడ్ ప్రముఖులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కాగా, డ్రగ్స్ కేసులో నిన్న హీరో రానాను ఈడీ అధికారులు విచారించారు. అంతకు ముందు డైరెక్టర్ పూరి జగన్నాధ్, హీరోయిన్స్ ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్ హాజరైయ్యారు. ఈ కేసులో సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. నవదీప్‌తో పాటు ఎఫ్‌-క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ 13న, ముమైత్‌ఖాన్‌ 15న, తనీష్‌ 17న, తరుణ్‌ 22న విచారణకు హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి: వినాయకచవితి ఉత్సవాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Advertisement

తాజా వార్తలు

Advertisement