Sunday, April 28, 2024

TS: ఝాన్సీని ఈడ్చుకెళ్లిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. బండి సంజయ్

ఏబీవీపీ మహిళా నాయకురాలిపై పోలీసులు వ్యవహరించిన తీరును సభ్యసమాజం అసహ్యించుకుంటోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ‘‘ఝాన్సీ ప్రజల కోసం నిజాయితీగా, శాంతియుతంగా పోరాడుతున్న నాయకురాలు. ఆమెను జుట్టుపట్టుకుని స్కూటర్ పై బరబరా ఈడ్చుకుంటూ లాక్కుపోతారా ? ఇంతకంటే హేయమైన చర్య ఉంటుందా ? సభ్య సమాజం అసహ్యించుకుంటోంది’’అని మండిపడ్డారు. తక్షణమే సమగ్రమైన న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement