Wednesday, May 1, 2024

న్యాయం చేయండి – శ‌వాల‌తో బాధిత కుటుంబాలు ధ‌ర్నా…

జోగులాంబ గద్వాల (ప్రతినిధి) – నేటి తెల్లవారుజామున ఆటోను బొలెరో వాహనం ఢికొన్న ప్ర‌మాదంలో సంఘటన స్థలంలోనే అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.. కేసు న‌మోదు చేసిన పోలీసులు బౌతిక‌కాయాల‌ను పోస్ట్ మార్ట‌మ్ కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు. ప్రమాదానికి కారకులైన బొలెరో వాహన యజమాని కానీ డ్రైవర్ని కానీ ఇంతవరకు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. దీంతో ముగ్గురు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృత దేహాల‌తో బాధిత కుటుంబీకులు న్యాయం చేయాలని కోరుతూ హాస్పిటల్ ముందు ప్రధాన రోడ్డుపై ధర్నాకు దిగారు.. ముగ్గురు మృతికి కారణమైన బొలెరో వాహన యజమాని అరెస్టు చేసి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.. ఈ ధ‌ర్నాతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే జామ్ అయిదిది. ఇదే సంద‌ర్భంగా మృతుల కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు న్యాయం చేసే వరకు ధర్నాను విరమించేది లేదని రోడ్డుపై బైఠాయించారు. దీంతో ప‌రిస్థితి ఉద్రిక‌త్త‌గా మారింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement