Thursday, May 2, 2024

Accident – రోడ్డు ప్ర‌మాదంలో త‌ల్లీకుమారుడు దుర్మ‌ర‌ణం

మెద‌క్ జిల్లా కౌడిప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని నాగ‌సాన్‌ప‌ల్లిలో చోటు చేసుకున్న రోడ్డు ప్ర‌మాదంలో త‌ల్లీకుమారుడు మృతి చెందారు. చిల్పేచేడ్ మండ‌ల ప‌రిధిలోని బ‌ట్టు తండాకు చెందిన రుదావ‌త్ గోప్యా(40) త‌న త‌ల్లి రాంకీ బాయ్‌తో క‌లిసి బైక్‌పై కొత్త‌పేట గ్రామానికి ఆదివారం రాత్రి బ‌య‌ల్దేరారు. అయితే త‌ల్లీకుమారుడు ప్ర‌యాణిస్తున్న బైక్‌ను వేగంగా వ‌చ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఇద్ద‌రు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. స్థానికులు క్ష‌త‌గాత్రులిద్ద‌రిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ సోమ‌వారం ఉద‌యం ప్రాణాలు కోల్పోయారు.

కొత్త‌పేట‌లో వారి బంధువు చ‌నిపోగా.. గోప్యా, రాంకీ బాయ్ క‌లిసి అంత్య‌క్రియ‌ల‌కు వెళ్తుండ‌గా ఈ ఘోరం జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement