Tuesday, May 7, 2024

Red Bath – ఎపిలో మ‌రో టమాటా రైతు దారుణ హ‌త్య – చేతికొచ్చిన పంట‌ను ఎత్తుకెళ్లిన ఆగంత‌కులు

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్న‌మ‌య్య జిల్లాలో దారుణం జ‌రిగింది. మ‌రో ట‌మాటా రైతును చంపేశారు. ఏడు రోజుల్లో ఇది రెండో ఘ‌ట‌న‌. వివ‌రాల్లోకి వెళ్తే.. అన్న‌మ‌య్య జిల్లాలోని పెద్ద తిప్ప‌స‌ముద్రం గ్రామానికి చెందిన రైతు మ‌ధుక‌ర్ రెడ్డి త‌న పొలంలో ట‌మాటా పంట వేశాడు. ప్ర‌స్తుతం ట‌మాటా ధ‌ర‌లు భారీగా పెరిగిన నేప‌థ్యంలో వాటిని కాపాడుకునేందుకు రైతు రాత్రింబ‌వ‌ళ్లు పొలం వ‌ద్దే ఉంటున్నాడు. ఆదివారం రాత్రి కూడా మ‌ధుక‌ర్ రెడ్డి త‌న ట‌మాటా పంట‌కు కాపలాగా ఉన్నాడు. రైతు నిద్రిస్తున్న స‌మ‌యంలో అత‌న్ని గుర్తు తెలియ‌ని దుండ‌గులు చంపేశారు. అనంత‌రం ట‌మాటాల‌ను తీసుకెళ్లారు దుండ‌గులు.

సోమ‌వారం పొలం వ‌ద్ద‌కు వెళ్లిన కుటుంబ స‌భ్యులు.. మ‌ధుక‌ర్ రెడ్డి డెడ్ బాడీని చూసి షాక్ అయ్యారు. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు రైతు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వారం రోజుల క్రితం ఇదే అన్న‌మ‌య్య జిల్లాలోని బోడుమ‌ల్ల‌దిన్నే గ్రామంలో 62 ఏండ్ల రైతును ట‌మాటాల కోసం చంపిన విష‌యం తెలిసిందే. ఆ రైతును న‌రేం రాజశేఖ‌ర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement