Friday, April 26, 2024

వ‌రంగ‌ల్ జిల్లాలో ప్ర‌మాదం.. ఆటో- బైక్ ఢీకొన‌డంతో 14 మందికి తీవ్రగాయాలు

వరంగల్ జిల్లా చెన్నారావుపేట పోలీసు స్టేషన్ పరిధిలో ఇవ్వాల (బుధ‌వారం) సాయంత్రం యాక్సిడెంట్ జ‌రిగింది. ఆటో బైక్ ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. నెక్కొండ-గూడూరు ప్రధాన రహదారిపై టి.కె.తండా క్రాస్ రోడ్డు వ‌ద్ద‌ 18మందితో వెళ్తున్న ఆటో-ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో 14మందికి గాయాల‌య్యాయి. కాగా, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్న‌ట్టు స‌మాచారం.

తీవ్ర గాయాలైన వారిని హుటాహుటిన వ‌రంగ‌ల్ ఎంజీఎంకు త‌ర‌లించారు. స్వల్పంగా గాయాలైన వారిని స్థానిక డాక్ట‌ర్ల‌ దగ్గర చికిత్స అందిస్తున్నారు. చెన్నారావుపేట పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి విచారణ చేప‌ట్టారు. అయితో ఆటో, బైక్ యాక్సిడెంట్‌కి గ‌ల‌ కారణాలు తెలియాల్సి ఉంది. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement