Saturday, May 4, 2024

TS | బీటీపీఎస్​లో ప్రమాదం.. చిమ్ని పైనుంచి పడి కాంట్రాక్టు కార్మికుడి మృతి

మణుగూరు, (ప్రభ న్యూస్): మణుగూరు బీటీపీఎస్​ ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడు చనిపోయాడు. ఈ ఘటన ఇవ్వాల (సోమవారం) సాయంత్రం జరిగింది. ప్రమాదంలో చిమ్నిపై నుండి పడి కాంట్రాక్టు కార్మికుడు అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన సచిన్ మోహత్ కుబేర్ ప్రైవేటు కంపెనీలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇవ్వాల సాయంత్రం బీటీపీఎస్​లోని చిమ్నీపైకి ఎక్కి పనులు చేస్తూ కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని తోటి కార్మికులు గమనించి అధికారులకు సమాచారం అందించారు.

అయితే.. ఈ విషయాన్ని బయటకి రానీయకుండా బీటీపీఎస్​ అధికారులు జాగ్రత్త పడ్డట్టు తెలుస్తోంది. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వివరాలను తెలియనీయకుండా, గుట్టుచప్పుడు కాకుండా మృత దేహాన్ని సొంత రాష్టానికి అంబులెన్స్ లో తరలించేందకు సిద్ధమయ్యారు. ప్రమాద విషయం బయటికి పోక్కడంతో జాగ్రత్తలు వహించారు. అయితే.. కొంతమంది కార్మికులు ఈ విషయాన్ని బయటికి తెలవడంతో పాటు, మణుగూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ ముత్యం రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. సేఫ్టీ జాగ్రత్తలు తీసుకుపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు తెలిపారు. అయితే.. కేసు నమోదు చేశారా, లేదా అన్న విషయం తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement