Saturday, April 27, 2024

ప్రాణాలు తీసిన అతి వేగం.. స్పాట్ లో ముగ్గురి మృతి

భీంగల్ టౌన్, మార్చి 28 ( ప్రభన్యూస్ ). అతివేగం ముగ్గురి ప్రాణాలు తీసింది. భీంగల్ శివారు లోని సబ్ స్టేషన్ వద్ద మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు స్వల్ప గాయలతో బయట పడ్డారు. గాయపడిన వారిలో మహిళ, వ్యక్తితో పాటు ఇద్దరు చిన్నారులు సేఫ్ గా బయట పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.

భీంగల్ మండలం బడా భీంగల్ ఎల్లమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విందుకు మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన వారు హాజరయ్యారు. విందు పూర్తి చేసుకుని ఏడుగురు వ్యక్తులు ఏపీ 09 బీఈ 7661 నెంబర్ గల కారులో తిరిగి వెళుతున్నారు. ఈ క్రమంలో భీంగల్ సబ్ స్టేషన్ వద్ద జేసీబీ ని ట్రాక్టర్ ట్రాలి పై తీసుకువస్తున్న ట్రాక్టర్ ను కార్ డీ కొట్టింది. ఈ ప్రమాదం లో ట్రాక్టర్ ఇంజిన్ తో పాటు ట్రాలీపై ఉన్న జేసీబీ కార్ పై పడింది. దాంతో కార్ లో ఉన్న ముగ్గురు వడ్ల రాజేశ్వర్ ( డొంకల్ ) గోవింద్ పేట్ కు చెందిన రమ తో మరో వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందారు.

గంటపాటు శ్రమించి బయటకు తీశారు.

ప్రమాదం జరిగిన సమయంలో పోలీసులు చేరుకునేందుకు సుమారు గంట ఆలస్యం అయినట్లు స్థానికులు తెలిపారు. కార్ పైనే ట్రాక్టర్ ఇంజిన్ తో పాటు జేసీబీ మొత్తం పడి పోయాయి. కార్ పై పడిన వాటిని తీసేందుకు మరో మూడు జేసీబీ లను తెప్పించారు. జేసీబీల సహాయంతో కారులో ఇరుకున్న ఇద్దరు చిన్నారులతో పాటు మరో ఇద్దరిని రక్షించి 108 లో ఆర్మూర్ దవాఖాన కు తరలించారు. మరో అంబులెన్సులో మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వ దావఖానకు తరలించారు. సంఘటన విషయం తెలుకున్న ఎస్సై రాజ్ భరత్ రెడ్డి తన సిబ్బంది తో కలిసి శ్రమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement