Thursday, May 2, 2024

HYD: కాంగ్రెస్, బీజేపీలకు షాక్.. మంత్రి సబిత సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు

మహేశ్వరంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు షాక్ తగిలింది. రెండు జాతీయ పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ మాజీ యువజన విభాగం అధ్యక్షుడు ఢిల్లీ శ్రీధర్ బీఆర్ఎస్ లో చేరారు. అనునిత్యం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు ఉంటుండడంతో జాతీయ పార్టీలు బేజారవుతున్నాయి.

మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం కందుకూరు లేమూరు, దెబ్బడ గూడ, బాచుపల్లి గ్రామాల కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 150మంది తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారందరికీ సాధారణంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అనేది ముఖ్యం కాదు అభివృద్ధి ముఖ్యం, మహేశ్వరం నియోజకవర్గంలో కొట్లాడి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే సత్తా అది కేవలం సబితా ఇంద్రారెడ్డి తోనే సాధ్యమని భావించి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. యువజన విభాగం అధ్యక్షుడు ఢిల్లీ శ్రీధర్ మాట్లాడుతూ… మహేశ్వరంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉందన్నారు. సముచిత న్యాయం ఇవ్వట్లేదని భావించి సబితా ఇంద్రారెడ్డి అన్ని కులాలను అన్ని మతాలను కలుపుతూ ఒకే తాటిపై తీసుకొస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement