Tuesday, May 7, 2024

Ts: కారులో ఊపిరాడక వ్యక్తి మృతి.. రంగారెడ్డి జిల్లాలో ఘ‌ట‌న‌

ఇబ్రహీంపట్నం, (ప్రభన్యూస్): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోరం జ‌రిగింది. తుర్కగూడ గ్రామానికి చెందిన ఏనుగు సత్తిరెడ్డి కారులో ఊపిరాడక చ‌నిపోయాడు. ఈ ఘటన ఇవ్వాల (గురువారం) జ‌రిగింది. నూతన సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభం కార్యక్రమం, సీఎం కేసీఆర్ బహిరంగ సభకు తుర్కగూడ నుంచి జ‌న స‌మీక‌ర‌ణ జ‌రుగింది. టీఆర్ఎస్ వాహనాలలో త‌ర‌లి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ కారులో ఏనుగు సత్తిరెడ్డి (70) మీటింగ్ కోసం కారులో ఎక్కాడు. అయితే.. ఆ కారు యజమాని మరో కారులో బయలుదేరి వెళ్లారు. ఈ క్ర‌మంలో కారు లాక్ వేయడంతో కారులోనే శ్వాస ఆడక చ‌నిపోయిన‌ట్టు గ్రామస్తులు తెలిపారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement