Tuesday, May 14, 2024

Accident | నిర్మల్​ జిల్లాలో ఘోర ప్రమాదం.. టిప్పర్​ని ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి

నిర్మ‌ల్ జిల్లాలో ఇవ్వాల (ఆదివారం) ఘోర ప్రమాదం జరిగింది. మామ‌డ మండ‌లంలో టిప్ప‌ర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో ముగ్గురు చనిపోయారు. మామ‌డ మండ‌ల ప‌రిధిలోని బూర్గుప‌ల్లి – మొండిగుట్ట మ‌ధ్య రోడ్డు నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే టిప్ప‌ర్ ఆ ర‌హ‌దారి నిర్మాణ ప‌నుల్లో నిమ‌గ్న‌మైంది. అదే దారిలో వేగంగా దూసుకొచ్చిన లారీ.. అదుపుత‌ప్పి టిప్ప‌ర్‌ను ఢీకొట్టింది. ఈ స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా సోన్ ఎస్ఐ న‌వీన్ కుమార్ మాట్లాడుతూ.. మృతుల్లో ఇద్ద‌రు ఘ‌ట‌నాస్థ‌లంలోనే చనిపోయారన్నారు. మ‌రొక‌రు నిర్మ‌ల్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ చ‌నిపోయిన‌ట్లు పేర్కొన్నారు.

మృతుల కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. మృతుల‌ను కుమ్రం రాజేంద్ర ప్ర‌సాద్(31), పీ లాల్ సింగ్(43), షేక్ ఖాసీం పీరా(43)గా గుర్తించారు. రాజేంద్ర ప్ర‌సాద్, లాల్ సింగ్ నేర‌డిగొండ మండ‌లానికి చెందిన వారు కాగా, షేక్ ఖాసీ అనంత‌పురం జిల్లాకు చెందిన వ్య‌క్త‌ని పోలీసులు పేర్కొన్నారు. లాల్ సింగ్ టిప్ప‌ర్ డ్రైవ‌ర్ కాగా, షేక్ ఖాసీం క్లీన‌ర్. రాజేంద్ర ప్ర‌సాద్ కూలీ అని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement